ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్లో భారత్కు చెందిన సురుచి సింగ్ వరుసగా మూడో అంచెలోనూ పసిడిని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించింది.
2025, జూన్ 13న జరిగిన మ్యూనిచ్ టోర్నీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె 241.9 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్లో రజత పతక విజేత కామిలె జెద్రెజివిస్కి (241.7) రెండో స్థానంలో నిలిచింది.
యో కియన్జువన్ (221.7) కాంస్యం నెగ్గింది.
మ్యూనిచ్ ప్రపంచకప్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం.