ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో 2024, అక్టోబరు 2న భారత్ ఖాతాలో మరో అయిదు స్వర్ణ పతకాలు చేరాయి. పెరూలో జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత క్రీడాకారులు సత్తాచాటారు.
* మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దివాంషి 35-33తో క్రిస్టినా మాగ్నాని (ఇటలీ)పై గెలిచి బంగారు పతకం సాధించింది.
* టీమ్ విభాగంలో దివాంషి, తేజస్విని, విభూతి భాటియాలతో కూడిన భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది.
* పురుషుల విభాగంలో ముకేశ్ నేలవల్లి అగ్రస్థానంతో స్వర్ణం నెగ్గాడు.
* ముకేశ్, సూరజ్శర్మ, ప్రద్యుమ్న్ సింగ్లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం సాధించింది.
* పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషనల్లో శౌర్య సైని, వేదాంత్ నితిన్, పరీక్షిత్ సింగ్లతో కూడిన భారత బృందం స్వర్ణం గెలుచుకుంది.