ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 2024, సెప్టెంబరు 30న లిమా (పెరూ)లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగం కాంస్య పతక పోరులో గౌతమి బానోత్-అజయ్ మలిక్లతో కూడిన భారత ద్వయం 17-9తో అనామార్జియా-డార్కో టామ్సెవిచ్ (క్రొయేషియా) జంటను ఓడించింది. ఈ విభాగంలో చైనా, ఫ్రాన్స్ వరుసగా స్వర్ణ, రజత పతకాలు నెగ్గాయి.