Published on Aug 30, 2025
Current Affairs
ఐఎమ్‌ఎఫ్‌ ఈడీగా ఉర్జిత్‌ పటేల్‌
ఐఎమ్‌ఎఫ్‌ ఈడీగా ఉర్జిత్‌ పటేల్‌

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ 2025, ఆగస్టు 29న నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న డాక్టర్‌ క్రిష్ణమూర్తి సుబ్రమణియన్‌ను 2025, మేలోనే ప్రభుత్వం తొలగించింది.