Published on Sep 24, 2024
Current Affairs
ఐఎస్‌ఎస్‌ నుంచి భూమిపైకి వ్యోమనౌక
ఐఎస్‌ఎస్‌ నుంచి భూమిపైకి వ్యోమనౌక

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములు రష్యాకు చెందిన సోయజ్‌ వ్యోమనౌకలో 2024, సెప్టెంబరు 23న భూమికి తిరిగొచ్చారు. వీరిలో రష్యాకు చెందిన ఒలెగ్‌ కొనోనెంకో, నికోలాయ్‌ చబ్, అమెరికా వ్యోమగామి ట్రేసీ డైసన్‌లు ఉన్నారు. 

ఒలెగ్, నికోలాయ్‌లు అంతరిక్ష కేంద్రంలో 374 రోజులు ఉన్నారు. తద్వారా రోదసిలో సుదీర్ఘకాలం గడిపిన వ్యోమగాములుగా రికార్డు సృష్టించారు. ట్రేసీ ఆరు నెలలు పాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించారు.