తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక (సీటీఎస్) ఐఎన్ఎస్ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు 2026, ఫిబ్రవరి 17న తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్ అండ్ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్చౌహాన్ సతీమణి అనుపమా చౌహాన్ చేతుల మీదుగా నౌకను జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఏడాది చివరలో నేవీకి అప్పగించనున్నారు.