Published on Sep 2, 2025
Current Affairs
ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌గా అజయ్‌ సేథ్‌
ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌గా అజయ్‌ సేథ్‌

బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్‌ సేథ్‌ 2025, సెప్టెంబరు 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన కర్ణాటక క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. సేథ్‌ 2025, జూన్‌లో ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.