కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2025, ఫిబ్రవరి 10న బెంగళూరులో 15వ ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను (ఏరో ఇండియా-2025) ప్రారంభించారు. ‘ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచే ఈ షోకు ఈ దఫా ఇతివృత్తం (థీమ్) ‘రన్ వే ఫర్ బిలియన్ అపార్చునిటీస్’. 90 దేశాల నుంచి 150 కంపెనీలు పాల్గొన్నాయి. 900కు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. అమెరికా, రష్యా తదితర దేశాల యుద్ధవిమానాల విన్యాసాలుంటాయి. 30 దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఫిబ్రవరి 14న విన్యాసాలు ముగుస్తాయి.
భారత రక్షణ రంగం ఉత్పాదనపరంగా రూ.1.27 లక్షల కోట్లు, ఎగుమతుల్లో రూ.21 వేల కోట్లు దాటిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.