మలయాళ మనోరమ గ్రూప్ చీఫ్ అసోసియేట్ ఎడిటర్, డైరెక్టర్ రియాద్ మాథ్యూ 2024, సెప్టెంబరు 18న ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)కు ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఏడాది కాలం (2024-25) ఉంటారు.
* ఏబీసీ మండలిలో ప్రకటనకర్తలు/ఖాతాదారుల తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కరుణేశ్ బజాజ్ (ఐటీసీ లిమిటెడ్) డిప్యూటీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.