Published on Sep 19, 2024
Current Affairs
ఏబీసీ ఛైర్మన్‌గా రియాద్‌ మాథ్యూ
ఏబీసీ ఛైర్మన్‌గా రియాద్‌ మాథ్యూ

మలయాళ మనోరమ గ్రూప్‌ చీఫ్‌ అసోసియేట్‌ ఎడిటర్, డైరెక్టర్‌ రియాద్‌ మాథ్యూ 2024, సెప్టెంబరు 18న ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ)కు ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఏడాది కాలం (2024-25) ఉంటారు.

* ఏబీసీ మండలిలో ప్రకటనకర్తలు/ఖాతాదారుల తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కరుణేశ్‌ బజాజ్‌ (ఐటీసీ లిమిటెడ్‌) డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.