Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 28, 2026
Current Affairs
ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌
ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌
  • ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ లిసా గిల్‌ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కనున్నారు.
  • హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ పదవీకాలం 2026 ఏప్రిల్‌ 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే జస్టిస్‌ లిసా గిల్‌ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది.