ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజి మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. 37 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలందిస్తున్నారు.
బాలాజి నియామకంతో ఆ సంఖ్య 33కి చేరింది. న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు బాలాజి పేరును హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.