దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నార్వే, అబుధాబి సావరిన్ నిధుల మాదిరి విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ తరహా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిధితో పాటు.. ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిసోతంది. ఫండ్పై వచ్చే లాభాలను పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.