విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను బ్యాక్ లాగ్ (6, 7, 8, 9వ తరగతుల)లో మిగిలి ఉన్న ఖాళీలను (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025
ప్రవేశాలు:
6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్ లాగ్ ప్రవేశాలు
అర్హత: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025- 26 విద్యా సంవత్సరంలో చేరాలనుకుంటే తరగతికి ముందు ఉండే తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. ఉదాహరణకు ఆరో తరగతి ప్రవేశానికి ఐదో తరగతి చదువుతూ ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు తెలుగు (20)ఇంగ్లిష్(20 మార్కులు), గణితం(20 మార్కులు) ఈవీఎస్ (40 మార్కులకు) ఉంటుంది. మిగితా అన్ని తరగతుల్లో ప్రవేశాలకు తెలుగు(20 మార్కులు), ఇంగ్లిష్(20 మార్కులు), గణితం(20 మార్కులు), సైన్స్(20 మార్కులు), సాంఘికశాస్త్రం(20 మార్కులు)లకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తు గడువు: 15.03.2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 28.04.2025.
Website:https://mjpapbcwreis.apcfss.in/
Apply online:https://mjpapbcwreis.apcfss.in/paymentPage