Published on Feb 17, 2025
Admissions
ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు
ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 18 ఎంజేపీఏపీబీసీడబ్ల్యూ సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంసీజే ఏపీ బీసీ ఆర్‌జేసీ సెట్‌ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. 

వివరాలు:

మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ ఆర్‌జేసీ సెట్‌-2025

ప్రవేశాలు: 

మొత్తం బాలుర జూనియర్‌ ఇంటర్మీడియట్‌ సీట్లు: 1340

మొత్తం బాలికల జూనియర్‌ ఇంటర్మీడియట్‌ సీట్లు: 1340

అర్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: 31.08.2025 నాటికి 17 ఏళ్లు మించకూడదు.  

ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ఒప్పు సమాధానానికి ఒక మార్కు ఉంటుంది, తప్పు సమాధానానికి మార్కులో నాలుగో వంతు కోత విధిస్తారు. తీసుకునే గ్రూపును అనుసరించి సబ్జెక్టుల వారిగా మార్కులు ఉంటాయి.

పరీక్షా కేంద్రం: ఆంధ్రప్రదే    శ్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్‌ కలశాలల్లో

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.03.2025.

ప్రవేశ పరీక్ష: 20.04.2025.

Website:https://mjpapbcwreis.apcfss.in/

Apply online:https://mjpapbcwreis.apcfss.in/paymentPage