ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70.
వివరాలు:
1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు
2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05 పోస్టులు
3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు
అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-01-2025.
Website:https://escihyd.org/