Published on Apr 9, 2025
Admissions
ఏపీ ఎడ్‌సెట్‌-2025
ఏపీ ఎడ్‌సెట్‌-2025

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2025 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 

వివరాలు:

ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2025 

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్టులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. 

పరీక్ష విధానం: మూడు విభాగాలుగా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.450; బీసీలకు రూ.500; ఓసీలకు రూ.650.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-04-2025.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2025.

ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2025 నుంచి 19-05-2025 వరకు.

ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2025 23-05-2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 24-05-2025 నుంచి 28-05-2025 వరకు.

హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 30-05-2025.

ప్రవేశ పరీక్ష తేదీ: 05-06-2025.

ప్రిలిమినరీ కీ విడుదల: 10-06-2025.

ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: 13-06-2025.

ఫలితాలు విడుదల: 21.06.2025.

Website:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx

Apply online:https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx