ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 ఉచిత శిక్షణకు గాను సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ శాఖలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వ కల్పించనుంది.
వివరాలు:
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ 2024-25
సీట్లు: మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050; ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయించారు. ఎంపికైన వారికి ఉచితంగా బోధన, భోజనం, వసతి సౌకర్యాలు అందుతాయి.
అర్హత: ఎస్జీటీ కోచింగ్కు ఇంటర్, డీఈడీ, టెట్; స్కూల్ అసిస్టెంట్ కోచింగ్కు డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, టెట్ స్కోరుకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 21-10-2024.
హాల్టిక్కెట్ డౌన్లోడ్ తేదీలు: 22-10-2024 నుంచి 25-10-2024 వరకు.
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 27-10-2024.
జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి: 28-10-2024.
జిల్లాల వారీగా తుది ఎంపిక జాబితా వెల్లడి: 30-10-2024.
శిక్షణ కేంద్రాల వారీగా అభ్యర్థుల కేటాయింపు: 03-11-2024.
తరగతులు ప్రారంభం: 11-11-2024.
Website:https://jnanabhumi.ap.gov.in/#undefined1
Apply online:https://mdfc.apcfss.in/