ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శారీరక (వ్యాయామ) విద్యా సాదరణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీఈసెట్) -2025 నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) విడుదల చేసింది. దీన్నీ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీఈసెట్-2025)
కోర్సులు: బీపీఈడీ (రెండేళ్లు), డీపీఈడీ (రెండేళ్లు)
విద్యార్హత: బీపీఈడీ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 01-07-2025 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు 01-07-2025 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
క్రీడల పోటీలు: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్ ద షాట్, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్/ హై జంప్; మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్ ద షాట్, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్/ హై జంప్ ఉంటాయి. ఒక్కో ఈవెంట్కు 100 మార్కులు కేటాయిస్తారు. రెండో విభాగంలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్ టెన్నిస్, వాలీబాల్ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి.
పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.900; బీసీలకు రూ.800. ఎస్సీ/ ఎస్టీలకు రూ.700.
ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు: ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
మే 11 - 13 వరకు: రూ.1000ల నుంచి రూ.2000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం
దరఖాస్తు సవరణ తేదీలు: జూన్ 12 - 14 వరకు అవకాశం.
హాల్ టికేట్స్ డౌన్లోడింగ్: జూన్ 17 నుంచి
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ 23 నుంచి ఫిజికల్ ఎఫిషియేన్సీ, గేమ్స్ స్కిల్ టెస్ట్ నిర్వహాస్తారు.
Website:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
Apply online:https://cets.apsche.ap.gov.in/PECET/PECET/PECET_HomePage.aspx