Published on Sep 17, 2024
Current Affairs
ఏటా సెప్టెంబరు 17న ‘ప్రజాపాలన దినోత్సవం’
ఏటా సెప్టెంబరు 17న ‘ప్రజాపాలన దినోత్సవం’

ఏటా సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024, సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీచేసింది. 1948 సెప్టెంబరు 17న తెలంగాణ.. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనలోకి ప్రవేశించింది. స్వతంత్ర భారతదేశంలో భాగంగా మారిందనడానికి ఈ రోజు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. దీనిలో భాగంగానే 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.