అభివృద్ధి చెందుతున్న దేశాలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను గణనీయ స్థాయిలో వినియోగిస్తున్నాయని కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీ తెలిపింది. ‘ఏఐ ఎడ్జ్ ఫర్ వికసిత్ భారత్’ పేరుతో ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం 2035 నాటికి మనదేశంలో 5 ప్రాధాన్యతా రంగాల్లో ఏఐ వాటా 550 బిలియన్ డాలర్ల (రూ.50.6 లక్షల కోట్ల)కు చేరుతుందని అంచనా వేసింది.
దేశంలో ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, విద్య, తయారీ రంగాల వృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.