Published on Apr 19, 2025
Current Affairs
ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు
ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు

ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలను సూచిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ 2025, ఏప్రిల్‌ 18న ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 15 శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించించారు.

గ్రూప్‌-1లోని రెల్లి, ఉపకులాలకు 1%, గ్రూప్‌-2లోని మాదిగ, ఉపకులాలకు 6.5%, గ్రూప్‌-3లోని మాల, ఉపకులాలకు 7.5% రిజర్వేషన్‌ వర్తించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 200 రోస్టర్‌ పాయింట్ల విధానాన్ని ప్రతిపాదించింది.