తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ప్రభుత్వం 2024, అక్టోబరు 11న ఏకసభ్య కమిషన్ను నియమించింది. వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసి, 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ను కోరింది.