Published on Oct 16, 2024
Current Affairs
ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్‌
ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్‌

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ప్రభుత్వం 2024, అక్టోబరు 11న ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసి, 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌ను కోరింది.