అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని.. దిగుమతులు రాణించినా కూడా, ఏడాది వ్యవధిలోనే మనకు వాణిజ్య మిగులు 90 బిలియన్ డాలర్లు (రూ.8.19 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదికలో పేర్కొంది. ఏడాది వ్యవధిలో అగ్రగామి 15 వస్తువుల ఎగుమతులే 97 బి. డాలర్లకు చేరతాయని, మిగతా వస్తువులూ కలిపితే ఏటా 100 బి. డాలర్ల మార్కును చేరొచ్చని వివరించింది.
2024-25లో అమెరికాతో మనకు 40.9 బి.డాలర్ల మిగులు ఉండగా, 2025-26లో ఏప్రిల్-డిసెంబరు కాలానికి 26 బి.డాలర్లుగా ఉంది.