Published on Jun 11, 2025
Current Affairs
ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక
ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

మనదేశంలో అత్యంత పేదరికం బాగా తగ్గినట్లు ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా నివేదిక 2025, జూన్‌ 10న వెల్లడించింది.

2023లో దేశంలో అత్యంత పేదలు 6.35 శాతంగా ఉండగా, 2024లో 4.6 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. 

ప్రపంచ బ్యాంకు కూడా ఇటీవల ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2023లో మనదేశంలో అత్యంత పేదలు 5.2 శాతం మంది ఉన్నారు.

గతంలో అయితే రోజుకు 2 డాలర్ల ఆదాయానికి దిగువున ఉన్న వారిని నిరుపేదలుగా పరిగణించేవారు.

తరవాత  ఈ పరిమితిని రోజుకు 3 డాలర్ల (సుమారు రూ.257)కు ప్రపంచ బ్యాంకు సవరించింది.

కొత్త నిర్వచనం ప్రకారం కూడా మనదేశంలో అత్యంత పేదల సంఖ్య బాగా తగ్గుతోంది.