Published on Sep 3, 2024
Current Affairs
ఎస్‌బీఐ ఎండీగా రామ మోహన్‌ రావు
ఎస్‌బీఐ ఎండీగా రామ మోహన్‌ రావు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా తెలుగువారైన రామ మోహన్‌ రావు అమరా 2024, సెప్టెంబరు 2న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

* ఎస్‌బీఐ ఛైర్మన్‌గా సి.ఎస్‌.శెట్టికి పదోన్నతి లభించడంతో, ఖాళీ అయ్యిన స్థానానికి రామ మోహన్‌ రావును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) ఎంపిక చేసింది. రామ మోహన్‌ రావు ఎంపికతో ఎస్‌బీఐకి ఆయన నాలుగో ఎండీ అవుతారు.