Published on Dec 19, 2024
Current Affairs
ఎస్‌బీఐ ఎండీగా రామమోహన్‌ రావు అమర
ఎస్‌బీఐ ఎండీగా రామమోహన్‌ రావు అమర

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు మేనేజింగ్‌ డైరెక్టరుగా రామమోహన రావు అమర 2024, డిసెంబరు 18న నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయన్ను ఈ పదవిలో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 

ఇప్పటివరకు ఆయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. ఇంతకుమునుపు ఎస్‌బీఐ ఎండీగా ఉన్న సి.శ్రీనివాసులు శెట్టి, బ్యాంక్‌ ఛైర్మన్‌గా నియమితులవ్వడంతో ఎండీ పదవీ ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఆ స్థానంలోకి రామమోహన్‌ రావు రానున్నారు.