Published on Jan 20, 2025
Current Affairs
ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌
ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌

తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ముందుకు వచ్చింది.

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో  అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎస్టీటీ గ్రూప్‌ సీఈవో బ్రూనో లోపెజ్‌ జనవరి 18న ఒప్పందంపై సంతకాలు చేశారు.

ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్‌ ఏర్పాటుతో కంపెనీ... కార్యకలాపాలను విస్తరించనుంది.