Published on Jun 9, 2025
Current Affairs
ఎల్‌ఐసీ ఎండీగా సత్‌పాల్‌ భాను
ఎల్‌ఐసీ ఎండీగా సత్‌పాల్‌ భాను

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సత్‌పాల్‌ భానుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. 2025, జూన్‌ 8 నుంచి 3 నెలల పాటు ఈ హోదాలో ఆయన కొనసాగనున్నారు. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ఉన్న నలుగురు ఎండీల్లో అత్యంత సీనియర్‌ సత్‌పాల్‌. ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓగా ఉన్న సిద్ధార్థ మొహంతి జూన్‌ 7న పదవీ విరమణ చేసినందున, సత్‌పాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.