లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సత్పాల్ భానుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. 2025, జూన్ 8 నుంచి 3 నెలల పాటు ఈ హోదాలో ఆయన కొనసాగనున్నారు. ప్రస్తుతం ఎల్ఐసీలో ఉన్న నలుగురు ఎండీల్లో అత్యంత సీనియర్ సత్పాల్. ఎల్ఐసీ ఎండీ, సీఈఓగా ఉన్న సిద్ధార్థ మొహంతి జూన్ 7న పదవీ విరమణ చేసినందున, సత్పాల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.