భారత నౌకాదళానికి చెందిన సముద్ర నిఘా విమానం పి8ఐ నుంచి ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. గోవా తీరానికి చేరువలో ఈ పరీక్షలు జరిగాయి. దేశీయంగా రూపొందిన ఈ సాధనం పేరు ఏడీసీ-150. దీని బరువు 150 కిలోలు. దీనికి సంబంధించిన పరీక్షలన్నీ పూర్తయ్యాయని, త్వరలోనే నేవీలో చేరనుందని రక్షణశాఖ 2026, మార్చి 10న తెలిపింది.