Published on Aug 29, 2024
Current Affairs
‘ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌’ 2024 వార్షిక నివేదిక
‘ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌’ 2024 వార్షిక నివేదిక

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన ‘ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌’ 2024 వార్షిక నివేదిక 2024, ఆగస్టు 28న విడుదలైంది. దీని ప్రకారం, భారతదేశంలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం 2021 ఏడాదితో పోల్చితే  2022లో 19.3% తగ్గింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, బంగ్లాదేశ్‌ తర్వాత రెండో అత్యధికం. దీంతో భారత పౌరుల ఆయుర్ధాయం సగటున ఒక ఏడాది పెరిగింది.

నివేదికలోని అంశాలు:

* భారత్‌లోని అత్యంత కలుషితమైన ఉత్తర మైదానాల్లో 2021తో పోలిస్తే 2022లో 17.2 శాతం కాలుష్య తగ్గుదల నమోదైనప్పటికీ, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు సుమారు 5.4 సంవత్సరాల ఆయుర్ధాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు ధూళి కణాల కాలుష్యం స్థాయిల క్షీణత ఇలాగే కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ఇక్కడి వారి ఆయుర్ధాయం 1.2 సంవత్సరాలు పెరుగుతుంది. 

* మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు అత్యధిక కాలుష్య భారాలు మోస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు 2.9 సంవత్సరాల ఆయుష్షు కోల్పోతున్నారు. 

* నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ కింద ఉన్న నగరాలు, జిల్లాల్లో కాలుష్య సాంద్రతలు సగటున 19 శాతం తగ్గాయని నివేదిక తెలిపింది.