ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఉన్న జాతీయ రహదారి-37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్)ని ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 14న ప్రారంభించారు. మోరాన్ బైపాస్ వద్ద రూ.వంద కోట్లతో తీర్చిదిద్దిన ఈఎల్ఎఫ్పై సి-130జే విమానంలో మోదీ ల్యాండయ్యారు. చైనాతో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈశాన్య భారతంలో నిర్మించిన తొలి వ్యూహాత్మక రన్వే ఇది.