యూకే ప్రభుత్వ నిఘా సంస్థ ‘ఎమ్ఐ6’ 18వ చీఫ్గా బ్లేయిస్ మెట్రెవేలీ నియమితులయ్యారు. 116 ఏళ్ల చరిత్ర ఉన్న ‘ఎమ్ఐ6’కి నాయకత్వ బాధ్యత వహించనున్న మొదటిసారిగా ఈమె నిలిచారు. దేశంలో టెర్రరిజాన్ని అరికట్టడం, రాష్ట్రాల్లో అల్లర్లను అడ్డుకోవడం, సైబర్ భద్రతను కాపాడటం వీరి ప్రధాన కర్తవ్యాలు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆంత్రపాలజీ చదువుకున్న మెట్రెవేలీ 1999లో దేశ నిఘా విభాగంలో చేరి మధ్య ఆసియా, ఐరోపాలో విధులు నిర్వర్తించారు.