2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబరు వరకు మన దేశంలోకి 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.87 లక్షల కోట్ల) ఎఫ్డీఐ తరలివచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
సేవల విభాగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, వాహన, రసాయనాలు, ఔషధ రంగాల్లోకి ఎఫ్డీఐ అధికంగా వచ్చింది.
2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబరులో ఎఫ్డీఐ, వార్షిక ప్రాతిపదికన 45% పెరిగి 29.79 బి.డాలర్ల (సుమారు రూ.2.59 లక్షల కోట్ల)కు చేరింది.