ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకింగ్, 2024లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రపంచ స్థాయిలో 40వ ర్యాంకు సాధించింది. ఈసారి మనదేశం నుంచి ఈ జాబితాలో చోటు లభించిన విద్యా సంస్థ ఐఎస్బీ ఒక్కటే.
ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాంలో చేరాలనుకునే వారికి 10 సంవత్సరాలకు పైగా వ్యాపార అనుభవం, వ్యాపార సంస్థల యజమానులు కావడం, పేరున్న వ్యాపార సంస్థల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడం లేదా వృత్తి నిపుణులు అయి ఉండాలి.