Published on Oct 21, 2024
Current Affairs
ఎన్‌సీడబ్ల్యూ కొత్త ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్‌ రహాట్కర్‌
ఎన్‌సీడబ్ల్యూ కొత్త ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్‌ రహాట్కర్‌

జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) 9వ ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్‌ రహాట్కర్‌ నియమితులయ్యారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ 2024, అక్టోబరు 19న ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏదీ ముందు అయితే అది) ఆమె ఈ పదవిలో ఉంటారు.
* విజయ 2016-21 మధ్య మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2007-10 మధ్యకాలంలో ఛత్రపతి శంభాజీనగర్‌ మేయర్‌గానూ సేవలందించారు.