పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పించే జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) వాత్సల్యను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024, సెప్టెంబరు 18న ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు ఇది తోడ్పడుతుంది. ఇప్పటికే ఉన్న ఎన్పీఎస్ పథకాన్ని పిల్లలకు వర్తించేలా దీన్ని తీసుకొచ్చారు.