Published on May 30, 2025
Current Affairs
ఎన్‌డీఏలో శిక్షణ ముగించుకున్న తొలి మహిళా బ్యాచ్‌
ఎన్‌డీఏలో శిక్షణ ముగించుకున్న తొలి మహిళా బ్యాచ్‌

దేశ సైనిక చరిత్రలో తొలిసారిగా 17 మంది మహిళలు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో శిక్షణ ముగించి పట్టా అందుకున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో 2025, మే 29న జరిగిన ఎన్‌డీఏ 148వ స్నాతకోత్సవం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా మహిళా కేడెట్లతో సహా మొత్తం 339 మంది పట్టా పుచ్చుకున్నారు. వీరిలో 84 మంది బీఎస్సీ, 85 మంది కంప్యూటర్‌ సైన్సు, 59 మంది బీఏ, 111 మంది బీటెక్‌ పట్టాలు పొందారు. వీరిని త్రివిధ దళాల్లో అధికారులుగా నియమిస్తారు.