నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)- నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్టెట్) 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా ఆయుర్వేద, సిద్ధా, యునాని, హోమియోపతి వంటి ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోని సంబంధిత విభాగాలలో బోధనా వృత్తిలో చేరవచ్చు. ఎన్టెట్ అనేది అర్హత పరీక్ష, కోర్సు లేదా సంస్థకు ప్రవేశ పరీక్ష కాదు కాబట్టి నిర్దిష్ట సీట్ల కేటాయింపు లేదు. విజయవంతమైన అభ్యర్థులు ఎన్టెట్ సర్టిఫికేట్ను అందుకుంటారు, ఇది పది సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ఆయుష్/హోమియోపతి సంస్థలలో బోధనా పోస్టులకు మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారికి ఎన్టెట్ తప్పనిసరి.
వివరాలు:
విభాగాలు: ఆయుర్వేదం, సిద్ధ, యునాని & హోమియోపతి.
అర్హత: బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్ఎంఎస్ లేదా బీయూఎంఎస్ అండర్ గ్రాడ్యుయేట్ అర్హతలతో పాటు అనుబంధ సబ్జెక్టులలో గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) లేదా సంబంధిత మాస్టర్స్ డిగ్రీలను కలిగి ఉండాలి. ఆయుర్వేదం, సిద్ధ, యునాని కోసం పీజీ ప్రోగ్రామ్లో కనీసం 30 నెలలు పూర్తి చేయాలి. హోమియోపతికి పీజీ పూర్తి చేయడం తప్పనిసరి.
వయోపరిమితి: నిర్దిష్ట గరిష్ట వయోపరిమితి లేదు, కానీ అభ్యర్థులు వారి ఉద్దేశించిన బోధనా పదవికి సంబంధించిన అర్హత, అనుభవం ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, తిరుపతి.
పరీక్ష విధానం: ఎన్టెట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటల వ్యవధితో 100 మార్కులకు నిర్వహిస్తారు. నెగిటీవ్ మార్కింగ్ ఉండదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.06.2025.
ఫీజు చెల్లింపు గడువు: 24.06.2025.
దరఖాస్తు సవరణ తేదీలు: 25- 27 జూన్ 2025.
పరీక్ష తేదీ: 17.07.2025.
Website:https://exams.nta.ac.in/NTET/#
Apply online:https://ntet.ntaonline.in/