Published on Oct 16, 2024
Scholarships
ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ (గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్)-2025
ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ (గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్)-2025

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2025)ను డిసెంబర్‌ 8న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థ వెల్లడించింది. దీని ద్వ‌రా ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందిస్తారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నారు.

వివరాలు:

ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ (గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్)-2025

అర్హతలు: ప్రస్తుత విద్యాసంవత్సరం (2024-25) పదో తరగతి (స్టేట్‌/ సీబీఎస్‌ఈ/ ఐసీఎస్‌ఈ) చదువుతున్న విద్యార్థినులు అర్హులు.

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలు.

పరీక్షాంశాలు: మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జీకే, పదో తరగతి స్థాయి రీజనింగ్.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2024.

పరీక్ష తేదీ: 08-12-2024.

స్థలం: ఎన్టీఆర్ జూనియర్ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్‌ఆర్‌ జిల్లా.

Website:https://ntrcollegeforwomen.education/ntr-gest-scholarship-inter/

Apply online:https://pages.razorpay.com/pl_P4sy3rLgibB49u/view