ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎండీసీ), బైలడిల ఐరన్ ఓర్ మైన్, కిరందుల్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 197.
వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటిస్: 147
2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40
3. టెక్నీషియన్ అప్రెంటిస్: 10
విభాగాలు: సీఓపీఏ, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ డీజిల్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగం/ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా ఫార్మసి సైన్స్/బీబీఏ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులు www.apprenticeshipindia.org; గ్రాడ్యుయేట్/ టెక్నికల్ అప్రెంటిస్ అభ్యర్థులు https://nats.education.gov.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 12.11.2025 నుంచి 21.11.2025 వరకు.
వేదిక: ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బీఐఓఎం, కిరందుల్ కాంప్లెక్స్, దంతేవాడ, ఛత్తీస్గఢ్.
Website:https://www.nmdc.co.in/careers