మేఘాలయాలోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఈఈపీసీఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
వివరాలు:
1. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఎలక్ట్రికల్)-ఈ2-గ్రేడ్: 13
2. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఫైనాన్స్)-ఈ2 గ్రేడ్: 08
3. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(హ్యూమన్ రీసోర్స్)-ఈ2 గ్రేడ్: 10
4. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(జియోలజీ)-ఈ2 గ్రేడ్: 02
5. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(లా)- ఈ2 గ్రేడ్: 01
6. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఐటీ)- ఈ2 గ్రేడ్: 02
7. అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ(ట్రైనీ)- ఈ2 గ్రేడ్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్), ఏఎంఐఈ, బీఎస్సీ, సీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంటెక్(జియాలజీ), ఐసీఎస్ఐ, ఎల్ఎల్బీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి 30 - 35 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 - రూ.1,60,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ 560; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13-03-2025.
Website:https://neepco.co.in/hi