- ఎగుమతిదార్లకు రుణాల లభ్యత మెరుగుపరచడానికి రూ.7,295 కోట్ల ఎగుమతుల తోడ్పాటు ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్ల వడ్డీ సబ్వెన్షన్ పథకంతో పాటు రూ.2,114 కోట్ల తనఖా తోడ్పాటు కూడా ఉంది. ఈ రెండు పథకాలను, ఆరు సంవత్సరాల (2025-31) కాలవ్యవధిలో అమలు చేయనున్నారు. వీటితో ఎగుమతిదార్ల వాణిజ్య రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
- 2025 నవంబరులో ఆమోదించిన రూ.25,060 కోట్ల ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం)లో ఇది రెండో భాగం.