మైసూరులోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఎఐఐఎస్హెచ్) డైరెక్ట్ ప్రాతిపదికన కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
వివరాలు:
1. ప్రొఫెసర్: 03
2. అసోసియేట్ ప్రొఫెసర్: 12
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 07
విభాగాలు: ఆడియాలజీ, స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ, స్పీచ్ సైన్సెస్, క్లినికల్ సైకాలజీ, ఈఎన్టీ, స్పీచ్ అండ్ హియరింగ్, ఎలక్ట్రానిక్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, ఎంబీబీఎస్/ఎంఎస్, పీజీ, పీహెచ్డీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250; మహిళ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ‘ ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, మానసగంగోత్రి, మైసూరు’ చిరునామకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 15-10-2024.
Website:https://aiishmysore.in/