Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 21, 2026
Private Jobs
ఉషోదయ పబ్లికేషన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఉషోదయ పబ్లికేషన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

హైదరాబాద్‌లోని ఉషోదయ పబ్లికేషన్స్, పబ్లిషర్స్ ఆఫ్ ఈనాడు మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

మేనేజ్‌మెంట్ ట్రైనీలు

అర్హత: గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్(ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలు) 

వయోపరిమితి: 24-26 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్-పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు బిజినెస్‌, ఆపరేషనల్‌ ఆక్టివిటీస్‌కు సంబంధించిన వివిధ రంగాల్లో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. 

జాబ్ లొకేషన్: శిక్షణలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈనాడు యూనిట్ ఆఫీసుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.25,000 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రారంభ వేతనం రూ.28,000 అందుతుంది.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2026.

Website:https://recruitment.myhrms.net/eenadu