Published on Nov 15, 2024
Current Affairs
ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు
ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు

కనుమూరు రఘురామకృష్ణరాజు 2024, నవంబరు 14న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు.