జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనం రూ.307గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2024-25 సంవత్సరం కంటే రూ.7 అదనంగా పెంచింది. 2025, ఏప్రిల్ 1 నుంచి పెంచిన కొత్త వేతనం అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఉపాధి పథకంలో కూలీలకు కేంద్రం ఏటా కనీస వేతనం రాష్ట్రాల వారీగా ప్రకటిస్తుంది.