లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2025, నవంబరు 30న పొడిగించింది. 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన 2020 డిసెంబరు 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టారు. 2021 నవంబరు 30వ తేదీన రెండేళ్లపాటు ఆయనకు పొడిగింపునిచ్చారు. మళ్లీ 2023, 2024లలో రెండుసార్లు ఏడాది చొప్పున పొడిగింపు ఇచ్చారు.