భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో 2025, జనవరి 27 నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నలిచింది.
యూసీసీ విధివిధానాలకు సంబంధించిన నోటిఫికేషన్, పోర్టల్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ఆవిష్కరించారు.
యూసీసీలోని కీలక అంశాలు:
వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది.
మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది.
సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహ జీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.