ప్రాంతీయ విమానయాన అనుసంధానతకు మరింత ఊతమివ్వడంలో భాగంగా రూ.28,840 కోట్ల కేటాయింపుతో నవీకరించిన ‘ఉడాన్’ పథకానికి కేంద్ర కేబినెట్ 2026, మార్చి 25న ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు ఈ నవీకరించిన పథకం అమల్లో ఉండనుంది. ఇప్పుడున్న ఉడాన్ పథకం గడువు 2026లోనే ముగియనుంది.
నవీకరించిన ఉడాన్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 100 ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం వచ్చే ఎనిమిదేళ్లలో రూ.12,159 కోట్లను కేటాయించనున్నారు.