Published on Sep 3, 2025
Current Affairs
ఈశాన్య రాష్ట్రాల్లో క్యాన్సర్‌ కేసులు ఎక్కువ
ఈశాన్య రాష్ట్రాల్లో క్యాన్సర్‌ కేసులు ఎక్కువ

క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.

2015-19 మధ్య ఆయిజోల్, ఈస్ట్‌ ఖాసీ హిల్స్, పపుంపరే, కామరూప్‌ అర్బన్‌తో పాటు మిజోరం రాష్ట్రంలో ఎక్కువ మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని పేర్కొంది.

దేశవ్యాప్తంగా 43 జనాభా ఆధారిత క్యాన్సర్‌ రిజిస్ట్రీ (పీబీసీఆర్‌)లను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. 

ఆ వివరాల ప్రకారం 2015-19 మధ్య 7.08 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా 2.06 లక్షల మరణాలు సంభవించాయి.

మహిళలు ఎక్కువ మంది ఈ జీవనశైలి వ్యాధి బారిన పడుతుండగా.. మరణించే వారిలో పురుషులు ఎక్కువగా ఉన్నారు.

క్యాన్సర్‌తో బాధపడేవారిలో 51.1 శాతం మహిళలు కాగా చనిపోయేవారిలో వీరి సంఖ్య 45 శాతంగా ఉంది.

అదే మొత్తం క్యాన్సర్‌ బాధితుల్లో పురుషుల వాటా 48.9 శాతం కాగా మరణాల సంఖ్య 55 శాతంగా ఉంది.